ఏపీ ఎన్నికల సంఘం తీరు దీంతో స్పష్టమైంది : జన సేన అధినేత పవన్ కల్యాణ్

  • అధికార అధికార పార్టీకి మొదటి నుంచి వత్తాసు 
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు జరుగుతాయని మేం చెప్పా 
  • అదెంత వాస్తవమో ఇప్పుడు తేటతెల్లమయింది

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ వాయిదా వేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడంతో అధికార పార్టీ పట్ల వారి తీరు తేటతెల్లమయ్యిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజమండ్రిలో ఆయన ఈరోజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు ప్రభుత్వానికి కొమ్ముకా సేలా ఉందన్నారు. రాష్ట్రంలో జరిగిన దౌర్జన్యాలు, ఆగడాలను ఇప్పటికైనా ఎన్నికల సంఘం గుర్తించి  ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.


Pawan Kalyan
election commission
Local Body Polls

More Telugu News